Wednesday, February 15, 2012

చాల గొప్పవాడు??????

"నాధూరాం గాడ్సే చాల గొప్పవాడు .. ఎంతటి గొప్ప వాడంటే...ఆ .. ఆ .. ఆ ఎలా చెప్పాలబ్బా... ఆ.. ఆ గాంధీ అంత గొప్పవాడు." ఛీ ఒక ఉన్మాది ప్రేలపనలో కూడా నిబద్దత ని వెతికే కవులు .. మేథావులు ఉన్నారు ... ఇంకేం మన వాదనని వ్యతిరేకించే వాళ్ళ నందరిని చంపుకుంటూ పొతే పోలా?

కొందరు త్యాగం చేయాలి! నశించాలి!


కొందరు త్యాగం చేయాలి!
నశించాలి!
నాశానమైపోవాలి!
అప్పుడే కాని దేశం బాగుపడదు!
ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?
"మాకొద్దీ తెల్ల దొరతనం " అనే పాటతో స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని ఉరకలేత్తించిన వాడు... తను కలుగన్న స్వతంత్రం సిద్దించాకా మద్రాసు లో భిక్షాటన చేస్తూ ..ఒక కన్ను సైతం కోల్పోయి ... పక్షవాతంతో ...1952 డిసెంబర్ 18 న కన్నుమూసిన .. గరిమెళ్ళ సత్యనారాయణ అనే ఒక దేశ భక్తుడు..నీకు ....నాకు...యావత్ దేశానికి స్వేఛ్చ స్వతంత్రాన్ని సాదించడానికి సమస్త జీవితాన్నిఅర్పించిన ధీశాలి...
ఈ రోజున నువ్ పుజించకున్న పర్లేదు... కానీ మిత్రమా ... అవమానించకు..నిను వెలిగించటానికి ఆరిపోయిన జీవితాలెన్నో వోసారి ఆలోచించు..