Monday, October 10, 2011

క్షమ వీరస్య భూషణం.

క్షమ వీరస్య భూషణం.
...ఒకవేళ పిరికితనానికి, హింసకి మధ్య ఎంపిక ఉండే పక్షంలో .. నేను హింసనే పాటించమనే చెపుతానని నానమ్మకం. 1908 లో నేను అత్యంత దారుణమైన దాడికి గురైన విషమసమయంలో , అక్కడ ఉండి ఉంటె ... తాను ఏం చేసి ఉండాల్సిందని నా పెద్ద కొడుకు నన్ను అడిగాడు. నేను చస్తుంటే వదిలేసి ... అక్కణ్ణించి పారిపోవాల లేక తాను కోరుకుంటున్నట్టు బలాన్ని ప్రయోగించి .. నన్ను నేను రక్షించాలా. హింసని ప్రయోగించిన సరే .. నన్ను రక్షించడమే తన ధర్మమని నేను అతనికి  చెప్పాను.
   ...తన గౌరవానికి భంగం కలిగేటప్పుడు పిరికితనంతో , నిస్సహాయమైన సాక్షిగా.. మారడం లేదా మిగలడం కంటే, తన గౌరవం కాపాడుకోవడానికి భారత దేశం ఆయుధాలు చేపట్టాలనే నేను భావిస్తాను.
ఐతే హింస కంటే  అహింస మహోన్నత మైనదని నా విశ్వాశం. క్షమ అనేది శిక్ష కంటే పౌరుషమైనదని నా నమ్మకం.  క్షమ వీరస్య భూషణం ( క్షమ అనేది వీరుడికి అలంకారం). శిక్షించే సామర్ద్యం ఉన్నప్పుడే ... వదిలి పెట్టడం క్షమ అనిపించు కుంటుంది. నిస్సహామైన ప్రాణి క్షమించినట్టు నటించడం అర్ధం లేనిది. పిల్లి చేతిలో ... ముక్కలు ముక్కలుగా చీల్చి చంపబడే ఎలుక, ఆ పిల్లిని ఎలా క్షమించగలదు. ఐతే భారతదేశం నిస్సహామైనదని నేను భావించటం లేదు. నన్ను కూడా నేను నిస్సహామైన ప్రాణి అనుకోను. నా శక్తినీ, భారత దేశపు శక్తినీ కూడా మరింత మంచి ప్రయోజనానికి వినియోగించాలని నేను భావిస్తున్నాను. నన్ను అపార్ధం చేసుకోవద్దు. బలం అనేది భౌతిక సామర్ద్యం నుంచి రాదు. అది అజేయమైన సంకల్పం నుండి వస్తుంది.
  ... భారత దేశంలో నూరు వేలమంది ఇంగ్లిషువాళ్ళు మూడు వందల మిలియన్ల ప్రజానీకాన్ని భయపెట్టనవసరం లేదని, మనం అర్ధం చేసుకుంటే సరిపోతుంది. కచ్చితమైన క్షమ అంటే అర్ధం మన బలాన్ని గురించి కచ్చితమైన ఎరుక అనే. వికసిత క్షమ నుంచి .. మహత్తర శక్తి తరంగం మనలో ప్రవేశిస్తుంది. ఇక్కడ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పలేక పోతుండటం పట్ల నాకు అంత పట్టింపు లేదు. ఆగ్రహం, ప్రతికారేచ్చలను జయించడానికి, మనకి శక్తి లేనట్టుగా , మనం అధః పాతాళంలో ఉన్న్నట్టుగా భావించుకుంటున్నాం. శిక్షించే హక్కును  త్యజించడం ద్వారా భారతదేశం సాధించేదేంతో వున్నదని, నేను చెప్పితీరాలి. మనం చేయడానికి ఎంతో మెరుగైన పని ఉంది. ప్రపంచానికి మహత్తరమైన కార్యాన్ని చేసి చుపాల్సిఉంది.
     నేను దార్శికుడిని కాను. నేను ఆచరణాత్మక ఆదర్శవాదిని. అహింసామతం అనేది ఎవరో ఋషులకో, ప్రవక్తలకో కాదు. అది సామాన్య ప్రజానికానికి కూడా. అహింస అనేది మానవధర్మం. హింస అనేది మృగధర్మం.
   ...అందుచేత నేను, అత్యంత పురాతనమైన ఆత్మత్యాగ ధర్మాన్ని భారత దేశం ముందు ఉంచుతున్నాను. సత్యాగ్రహం కానివ్వండి, దాని కొమ్మలైన సహాయ నిరాకరణ, పౌర ప్రతిఘటన అనేవి కానివ్వండి... ఇవి కొత్తవేమీ కావు, బాధని ఓర్చుకోవడమనే ధర్మానికి కొత్త పేర్లు మాత్రమే. హింస కల్లోలాల మధ్య అహింసాధర్మాన్ని కనుగొన్న ఋషులు ఎవరైతే ఉన్నారో..వారు న్యూటన్ కంటే మేధా సంపన్నులు. వారు వెల్లింగ్ టన్ కంటే మహా యోధులు. ఆయుధాల ఉపయోగం స్వయంగా తెలిసిఉండీ, వాటి నిరుపయోగాత్వాన్ని అవగాహన చేసుకున్నారు. దస్సిపోయిన ప్రపంచానికి విముక్తి, అహింస ద్వారానే కానీ హింస ద్వార రాదని వారు భోదించారు.
     గతిశీలమైన స్థితి లో ఉన్న అహింసకు అర్ధం ఎరుకతో బాధల్ని ఓర్చుకోవదమనే, ఆహిస అంటే, చెడు చేసే మనిషి దుష్ట సంకల్పం ముందు సాగిలపడటమని అర్ధం కాదు. ఒక పీడకుడి దుష్ట సంకల్పానికి ప్రతిగా, తన ఆత్మని మొత్తం బరిలోకి నిలపడమే ఆహింస అంటే. మన ఉనికికి సంబంధించిన ఈ నియమానికి బద్దులమై పనిచేసేటప్పుడు, తన గౌరవాన్ని, తన ధర్మాన్ని, తన ఆత్మని కాపాడుకోడానికి.. ఒక అధర్మ సామ్రాజ్య శక్తిని ధిక్కరించడం, దాని పతనానికి, లేదా పునర్నిర్మాణానికి పునాది వేయడం, ఒక ఒంటరి వ్యక్తికైనా సాధ్యమే అవుతుంది.
భారత దేశం బలహీనంగా వున్నది కాబట్టి ... అహింసని పాటించమని నేను వాదించడం లేదు. భారత దేశం తన శక్తి పట్ల, సామరస్యం పట్ల, ఎరుకతో అహింసని  పాటించాలని నేను కోరుతున్నాను.
''భారత దేశం బలహినంగా వున్నది కాబట్టి..ఆహింసని పాటించమని నేను వాదించడం లేదు.భారత దేశం తన శక్తి పట్ల,సామర్థ్యం పట్ల ఎరుకతో ఆహింసని పాటించాలని నేను కోరుతున్నాను.తన శక్తిని గుర్తించడానికి..,తనకి ఎటువంటి ఆయుధ  శిక్షని

అవసరమని ఎందుకనిపిస్తోందంటే, మనని కేవలం మాంసపు ముద్దలుగానే మనం భావింకోవడం వల్లనే,అని అనిపిస్తోంది.తనకి ఆత్మ ఉన్నదని..భరత దేశం గుర్తించాలి.ఆ ఆత్మ ఎన్నటికి నశించదని,భౌతికమైన బలహీనతలన్నింటిని అధిగమించి ..విజేతగా ఉదయించగలదనీ,యావ                భౌతిక శక్తినీ దిక్కరించగలదనీ అర్థం చేసుకోవాలి.ఆచరణ వాదిని కాబట్టి,రాజకీయ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనానికి ఉన్న ఆచరణాత్మకతను భారతదేశం గుర్తించేంత వరకూ నేను   వేచివుండలేను.
ఇంగ్లీషు వాళ్ళు మర తుపాకుల ముందు,టాంకుల ముందు,విమానాల  ముందు..భారత దేశం తనకి తాను బలహినురాలిగా,నిర్వీర్యురాలిగా భావించుకుంటోంది.బలహీనత నుంచే..తాను 'సహాయ నిరాకరణ 'పాటిస్తోంది.అయినప్పటికీ అది ఫలితా మిచేదే.'సహాయ నిరాకరణ'ను తగినంత మంది పాటిస్తే అది,ఎముకల్ని పిండిచేసే ...బ్రిటిష్ అధర్మ పాలన భారం నుంచి దేశాన్ని విముక్తి చేసేదే.భారత దేశం ఖడ్గధర్మాన్ని పాటిస్తే.తాత్కాలిక విజయాన్ని సాదింవచ్చు.అప్పుడు భారత దేశం నా హృదయాన్ని గర్వకారణం కాకుండా పోతుంది.నేను భారత దేశానికి కట్టుబడ్డాను.ఎందుకంటే,నా సర్వమూ ఆమె నుంచి వచ్చిందే .ఆమె ప్రపంచానికి సాధించి చూపాల్సిన కార్యం వున్నదని...నేను అక్కడ లేనట్టుగా కాకూడదని ఆశిస్తున్నాను.నా మతానికి ఎటువంటి భౌగోళికమైన సరిహద్దులూ లేవు.దానిపై నావిశ్వాసం సజివమైనదైతే...,అది భారత దేశం పైన భారతదేశం పైన నాకున్న ప్రేమను గెలిచేలా చేస్తుంది. yavathprapamcham  
                                                                                                                                                                                                              -మహాత్మా గాంధీ
[1920 లో గాంధీజీ వ్రాసిన సుప్రసిద్ధ వ్యాసం 'డక్ర్టిన్ ఆఫ్ స్వర్డ్ 'నుంచి ]