Wednesday, June 22, 2011

నామిని నిజంగానే పుడింగే (పుస్తకం.నెట్ లో జంపాల గారి సమీక్షకు నా స్పందన )

ఏ గొప్ప ఆదర్శాల గురించి నామిని ఎప్పుడు  మాట్లాడలేదు ఏ కథలోనూ తను పాటకుల మీద పెమానం చేసి "నేను నూటికి ఇన్నూరు శాతం సత్తె పెమనికంగా సెప్తుండా నేను   సత్తె అరిచ్చేన్ద్రుడ్ని అని రోమ్మిరుస్కుని నిలబడింది లా.    
                                                     నా నంగి చేష్టలు, నా జుటాతనాలు, నా లోబి తనాలు,నా తాగుబోతు బుద్ధి, నా దొంగతనాలు అని తను వొంగొంగి దణ్ణాలు పెట్టుకున్న సందర్బాల గురించి సూళ్ళురుపేట, రాజంపేట లో తనని నలగోట్టిన సంగతిని  రాసుకున్నాడు గాని నిక్క నీలుక్కుని బిర్ర బిగుసుకుని ఫోటోకి ఫోజిచ్చుకోల కదా   ఇంకా ప్రముఖ రచియిత వంశి తన "పసల పూడి పులిసిన పులుసుని" నాలికి మిందేస్కుని అ టేస్ట్ మింద ఒక టెక్స్ట్ మెస్సేజ్ పంపమని  సేత పోరిన నామిని కలం యవన్న వొంగిదా?
బాపు చేత ఫోన్ చేయిస్తే  మాత్రం బాపు కాదు వాళ్ళ  బాబు చెప్పిన మరి నామిని అంటే మొగాలయే కదా  మళ్ళా రెకమండేషన్లు అంటే మా వోడికి అరికాలు మంట నేత్తికేక్కధ మరి. (ఇల్లేరమ్మ కథలేసినాడంటే కుసింత అర్ధం ఉండాదప్ప సుసీలమ్మ పైగా నువ్వే నా గురువంది ఐన ఈ కేడి నాయాలు తన పేరుని మాత్రం యేస్కోనీల కద అ యమ్మ పుస్తకంలో) నామిని కల్పనా సాహిత్యం రాయలేడు అని ఒక విసురు కల్పనా సాహిత్యం అందురు ఎలాగబెడతాఉండారుగదా ఏందీ భూమి పుట్టినప్పట్నుండీ ...

ఇట్ట ఇలావరిగా పక్కకు పిల్చుకేల్లి నా ఒక్కడితోనే తోనే మాట్లాడతున్నట్టు ఎవోక్కడు అన్న మనకు చెప్పినాడ కథలు  అని.. శైలి కంటే వస్తువే ముఖ్యమా? ఇప్పటిదాకా తెలుంగు సాహిత్యం తన చూపులు సారించని వస్తువులు ఉన్నాయా జంపాల  గారు? అయిన నామిని ని మీరుగాని నేనుగాని తన బుక్స్ ఇష్టంగా చదివే వారందరూ నచ్చేది తన శైలినే కదా? అచ్చరం పొల్లుబోకుండా కయ్యిల్లో ఊర్లల్లో  అచ్చరం మొకం చూడని వాళ్ళు మాట్లాడే మాటల్ని అచ్చులోకి దింపిన విలేజ్ బెమ్మ కదా సా.  నామినంటే.

         ఉడికాయో లేదో అని వేడి వేడి అవుర్లోంచి ఎత్తుకు తిన్న వేరు శేనక్కాయలా  లేవ?లేత తాటి ముంజులలో నీళ్ళ ను జుర్రుకుని ముంజుని తిన్నట్టులేదా దాని చుట్టూ ఉన్న వొగరు తపక ని ఉసేసినట్టే  జ్యోతి లో తప్పుడు లెక్కలు సుసీలమ్మ కంప్యూటర్ సంగతిని ఉసేసి సామాన్యుడి ఆనందాన్ని ఆస్వాదించండి సా. నామిని లాంటి సేతురోడు లేని ఊరు ఊరే కాదని నా ఇన్నపం.

కథంటే సేప్పినట్టు ఉండాలే కానీ రాసినట్టే ఉండకూడదనే మాట తెలుగచ్చరం పోయేదాకా నిలబడే మొగలాయ్ మాట కదా..ఇప్పటి దాక యేన కొడుకు సేప్పినాడో ఇంత నికార్సుగా.." అ గుడిసెలో కిరసనాయులు దీపం ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయి పోయిన పదో తరగతి కుర్రాడిలా బిక్కు బిక్కు మంటోంది"... అన్న పోలికని మనోడు ఎదిరించి నాడంటే నాకెంత సంతోషమో మాటల కందట్లేదురా నాయనలారా అమ్మలారా..కాకపోతే కిరసనాయులు దీపం కి తగులుకుని ప్రాణం కోటకలాడతున్న  రెక్కలున్న ఏ పురుగో దోమో ఈగో  అని రాయొచ్చు కద.  రావి శాస్త్రి , కేశవరెడ్డి మింద నామిని విసుర్లకి నాకు శాన కులుగ్గానే ఉండాది..హాయిగా వల్లిరుసుకుని అవులించినట్టే...... నామిని ఈ రోజున కోత్తగా అర్ధం అవడం ఏంటో నాకు పూర భోదపడట్ల..పచ్చనాకు సాక్షి గా చదివిన బుర్రున్న పెతోడికి యిట్టె తెలిసి పోవల్న్నే కానీ తెలియకపోతే మళ్ళ ఇకొక తురి చదవాలా.నామిని రాసిన కతలు అనేకంటే సెప్పె కతలంటేనే మరేద నాకు వాళ్ళమ్మతో కలిసి చేసిన జుటా పనులు జూస్తే తెలిద అని  వీళ్ళకి అని నాకు ఒకటే ఆచ్చేర్యంగ మనోఎద గా ఉండాదప్ప ..........  
నాకు చిన్నప్పుడు ఒక కల వచ్చేది అదేంటంటే నేను చెప్పుల్లేకుండా మట్టిలో ఓ అంట ఆడుకుంటూ దుమ్ములో కాలితో నాగల్లగా దున్నుకుంటా పోతుంటే రుపాయి బిళ్ళలు వచ్చేవి అట్టా ఎన్ని గేలకత ఉంటె అన్ని.. ఈ రకంగా ఎవురికన్నా డాలర్లు  దొరకతా ఉండయనుకునే అడిగాడేమో ఐన ఎన్జీ ఓ లు  జెపి కంటే పిల్లలో జీకే పెంచుతాననే నామినే బెటర్ కద .....ఛా..నాశినం ఈ మాటగూడ నాతో చెప్పించాల ఏందీ..